calender_icon.png 22 June, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు అదుపుతప్పి వ్యక్తి మృతి

21-06-2025 11:46:37 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి చెట్టును ఢీకొనగా వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం(Raipole Mandal) మంతూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన కుంట దుర్గాప్రసాద్(36) గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ్ముని కూతురు ఫంక్షన్ కి రాయపోల్ వచ్చాడు.

శనివారం ఉదయం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తానని రాయపోల్ నుంచి బయలుదేరాడు. సిద్దిపేట వెళ్లే క్రమంలో మార్గమధ్యలో మంతూర్ గ్రామ సమీపంలో అజాగ్రత్తగా అతివేగంతో వెళ్లి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి గమనిస్తే దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.