13-04-2025 09:43:16 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి) నెన్నల మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ధర్మరాజుల శ్రీనివాస్ (43) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఇంట్లో టేప్ రికార్డర్ ను షోల్డరింగ్ మిషన్ తో రిపేర్ చేస్తుండగా వైరు చేతికి తాకి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.