12-06-2025 01:26:11 AM
అనుమతుల్లేకుండానే మాల్ కార్యకలాపాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయ క్రాంతి): రాజధానిలోని చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ‘మాంగల్య షాపింగ్ మాల్’పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొరడా ఝళిపించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఓసీ లేకుండానే కార్యకలా పాలు నిర్వహిస్తున్న కారణంతో జీహెఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం ఆ మాల్లోని గ్రౌండ్, మొదటి అంత స్తులను సీజ్ చేశారు.
మాంగల్య షాపింగ్ మాల్పై అనధికారిక ఆక్రమణ, ఓసీ లేకుండా భవనాన్ని నడుపుతున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు జీహెఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. టి.వినయ్ కుమా ర్ ఇతరులు 3 సెల్లార్లు, గ్రౌండ్ 5 ఎగువ అంతస్తులతో వాణిజ్య , మల్టీప్లెక్స్ నిర్మాణం కోసం అనుమతులు పొందినట్లు ధృవీకరణలో తేలింది.
అయితే, భవన నియమావళి ప్రకారం తప్పనిసరి అయిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను మాల్ యాజమాన్యం జీహెఎంసీ నుండి పొందలేదు. దాదాపు 8 నెలల క్రితం ప్రారంభమైన ఈ మాల్ ప్రారంభోత్సవానికి ఒక ప్రముఖ సినీ నటి హాజరయ్యారు. అప్పటి నుంచీ ఓసీ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాల్పై జీహెఎంసీ అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, యాజమాన్యం వాటిపై స్పందిం చలేదు.
ఉద్యోగుల ఆందోళన..
ఈ ఆకస్మిక సీలింగ్ చర్యతో మాల్లో పనిచేస్తున్న సుమారు 100 నుంచి 150 మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.