మణిమహేశ్ యాత్ర ప్రారంభం
28-08-2024 02:54 AM
హిమాచల్ప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మణిమహేశ్ యాత్ర మొదలైంది. హిమాచల్లోని మణిమహేశ్ సరస్సును సందర్శించేందుకు ఈ యాత్రను చేపడుతారు. సాధారణంగా ఈ కాలంలోనే దాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా పేర్కొంటారు. హిమాచల్లో దాల్ సరస్సునే మణిమహేశ్ (మహాశివుడు) అని పిలుస్తారు. ఏటా జన్మాష్టమి అనంతరం మణిమహేశ్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలి వస్తునంటారు. ఈ యాత్ర రాధా జన్మాష్టమి(సెప్టెంబర్ 11)కి ముగిస్తుంది. కైలాస పర్వతంపై ఉండే మహాశివుడు దాల్ సరస్సు నుంచి అద్భుతంగా కనిపిస్తాడని నమ్ముతారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మ ఇక్కడే శివున్ని దర్శనం చేసుకున్నాడని, అప్పటి నుంచి ఈ యాత్ర ప్రారంభమైనట్లు తెలుస్తోంది.




