calender_icon.png 2 June, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీలుగ విత్తనాలతో రైతులకు పచ్చిరొట్ట ప్రయోజనాలు మరెన్నో

31-05-2025 06:00:05 PM

నాగారం: నాగారం మండలంలోని నాగారం గ్రామీణ ఆగ్రో ఎఫ్‌పి‌ఓ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీ ధరలపై పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాల పంపిణీ జరిగిందని మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్(Mandal Agriculture Officer Krishnakanth) అన్నారు. శనివారం పంపిణీ అనంతరం మాట్లాడుతూ... పచ్చిరొట్టు (జీలుగ) విత్తనాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, మట్టిలో సేంద్రియ పదార్థాల మోతాదును పెంచుతుంది, జీలుగ జాతులు వాతావరణ నైట్రోజన్‌ను బంధించి నేలలోకి విడుదల చేయగలవు, ఇది తదుపరి పంటలకు లాభదాయకం, పచ్చిరొట్ట మిగతా మొక్కల పెంపునకు అంతరాయంగా ఉండే కలుపు మొక్కలను తగ్గించగలదు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఖర్చు తక్కువగా  ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సాయిరాజ్ శ్రీనివాస్ సంధ్య షాప్ యజమాని  వెంకన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.