28-11-2025 10:43:53 AM
కరీంనగర్,(విజయాక్రాంతి): మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన(Maoist Party key statement) చేసింది. 2027 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని, ఆరోజు అందరం లొంగిపోతామని మావోయిస్టు జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోండం, హిడ్మా ఎన్ కౌంటర్ లో మరణించాడు. వరుస దెబ్బలతో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.