9 April, 2026 | 11:03 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మరోసారి భూముల వేలం.. ప్రారంభ ధర ఎంతంటే?

28-11-2025 10:22 AM

హైదరాబాద్: కోకాపేట భూములకు(Kokapet lands) రెండో విడత ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ప్లాట్ నంబర్ 15, 16లోని 9 ఎకరాల భూమికి ఆన్ లైన్ లో వేలం వేశారు. హెచ్ఎండీఏ(Hyderabad Metropolitan Development Authority) భూముల ప్రారంభ ధరను రూ.99 కోట్లుగా నిర్ణయించింది. నవంబర్ 25న జరిగిన తొలివిడత వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. కోకాపేట భూములు ఎకరానికి రూ. 137.25 కోట్లు ధర పలికింది. కోకాపేట నియోపోలీస్(Kokapet Neopolis)లో 29 ఎకరాలు, మూసాపేట దగ్గరున్న 16 ఎకరాల భూమిని వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది.  డిసెంబర్ 3,5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనుంది. కోకాపేట నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి ప్రారంభ ధర రూ. 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు ప్రారంభ ధర ఎకరానికి రూ. 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు ప్రారంభ ధర ఎకరానికి రూ. 75 కోట్లుగా నిర్ణయించింది. భూముల వేలం ద్వారా ఆదాయం భారీగా వస్తుందని హెచ్ఎండీఏ ఆశిస్తోంది.