12 July, 2026 | 2:46 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్

22-04-2025 01:27 PM

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపన్న హస్తం అందించడం జరుగుతుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మురగుండ్ల అనంతరాములు అనారోగ్యానికి గురికాగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ దృష్టికి తీసుకు వెళ్ళగా బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయించారన్నారు. మంగళవారం బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. పేదలకు సీఎం సహాయనిది ఎంతో మేలు చేస్తుందన్నారు.