19-05-2025 12:51:40 AM
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ వనస్థలిపురం సచివాలయ నగర్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను పీసీసీ సభ్యుడు, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్ క్యాంప్ను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.