22 June, 2026 | 1:26 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

అక్రమాలపై విచారణ జరపాలి

20-06-2026 04:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ క్రికెట్ను కుదిపేస్తున్న సంచలన ఆరోపణలు, 18 క్లబ్ల విక్రయాలపై ఆరోపణలు హెచ్సీఏకు అనుబంధంగా ఉన్న 18 క్రికెట్ క్లబ్లను నిబంధనలకు విరుద్ధంగా AM ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసి భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు ఆరోపించారు. క్రికెట్ అభివృద్ధి పేరుతో వ్యవస్థను కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు.

టీజీ20 లీగ్ వివాదం, హెచ్సీఏలో అధికారికంగా అనుమతి లేని రెండో బ్యాంకు ఖాతాను తెరిచి, దాని ద్వారా టీజీ20 లీగ్ నిర్వహణకు సంబంధించిన నిధుల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఖాతా ద్వారా జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని టీసీఏ కోరింది,

హెచ్సీఏలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీలు, క్లబ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, ఇందులో ఎవరి పాత్ర ఉందో వెలుగులోకి తీసుకురావాలని టీసీఏ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు అవసరమని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ 3 క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అని టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు శనివారం పత్రిక ప్రకటన లో పేర్కొనారు