04-05-2025 04:28:37 PM
కుటుంబ కలహాలతో అపార్ట్మెంట్ పై నుండి దూకి...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ(25) కి డిసెంబర్ 14-2024లో వివాహం జరిగింది. నగరానికి వచ్చి జీడిమెట్ల లోని సుభాష్ నగర్ లో గల తమ బంధువుల ఇంట్లో ఉంటుంది.
అయితే తన భర్త, కుటుంబ సభ్యులతో కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం లక్ష్మీ తాను ఉంటున్న అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.