4 July, 2026 | 8:50 PM

Breaking News

కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •  

అధికారులు రైతుల తరపున నిలవాలి..

04-05-2025 04:31 PM

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

బోథ్ (విజయక్రాంతి): పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చే రైతుల పక్షాన అధికారులు నిలిచి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా మార్కెట్ కు తొలి పంటను తీసుకొచ్చిన రైతును శాలువతో సన్మానించి, తూకం కాంటలకు పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... అధికారులు రైతుల తరఫున నిలవాలని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఎలాంటి సాకు చూపకుండా, రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.