17 April, 2026 | 11:56 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

అధికారులు రైతుల తరపున నిలవాలి..

04-05-2025 04:31 PM

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

బోథ్ (విజయక్రాంతి): పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చే రైతుల పక్షాన అధికారులు నిలిచి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా మార్కెట్ కు తొలి పంటను తీసుకొచ్చిన రైతును శాలువతో సన్మానించి, తూకం కాంటలకు పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... అధికారులు రైతుల తరఫున నిలవాలని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఎలాంటి సాకు చూపకుండా, రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.