05-11-2025 03:21:14 PM
పెద్ద ఎత్తున పాల్గొన్న దంపతులు.. భక్తులు..
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకల ను వైభవంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోనిఅయిత రాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని దంపతులచే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్ , ఆలయ అర్చకులు నాగేంద్ర చార్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.