15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

04-06-2025 11:34 PM

తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడిన వ్యక్తి..

నాగారం: నాగారం మండల(Nagaram Mandal) పరిధిలోని నాగారం బంగ్లా గ్రామ పంచాయతీలో వ్యవసాయ బావుల వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ను బుధవారం రిపేర్ కి తరలించే క్రమంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యుత్ షాక్ తగిలి కన్నెబోయిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం... కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలో తొలగించి రిపేర్ పంపాల్సి ఉండగా అధికారులు తమకేం పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ను రిపేర్ కు తరలించడానికి వెళ్ళారు. అధికారులు అన్నీ కలెక్షన్లు తొలగించినామని చెప్పడంతో ట్రాన్స్ఫర్ పైకి వ్యక్తి వెళ్లి కలెక్షన్లు రిమూవ్ చేస్తున్నారా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి కింద పడి స్పృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు సమయస్ఫూర్తితో సిపిఆర్ చేయడంతో తిరిగి స్పృహలోకి వచ్చారు. వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.