06-12-2025 10:40:09 PM
అగర్ మియగూడ నుంచి తరలివచ్చిన మహిళలు..
నిజాయితీగా ఉన్న అభ్యర్థులను ఎన్నుకోండి : కె ఎల్ ఆర్
కందుకూరు (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలో భారీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి భారీగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్చార్జి కిచ్చేన్న గారి లక్ష్మారెడ్డి సమక్షంలో చేరారు. శనివారం కందుకూరు మండలం అగర్ మియగూడ నుంచి మహిళలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అగర్ మియగూడ సీనియర్ నాయకులు ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తుక్కుగూడ కార్యాలయంలో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు నీరటి రమేష్ ముదిరాజ్, నరసింహా, లక్ష్మమ్మ సహా పలువురు నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి కెఎల్ఆర్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి అధికారంలో ఉన్న హస్తం పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. కెఎల్ఆర్ నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులందరినీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నినాదించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల నాయకులు పాల్గొన్నారు.