calender_icon.png 3 January, 2026 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారిషస్ మహిళకు కిమ్స్‌లో శస్త్ర చికిత్స

03-01-2026 12:00:00 AM

లాపోరోస్కోపిక్ ద్వారా కణతి తొలగింపు

హైదరాబాద్, జనవరి ౨ (విజయక్రాంతి) : కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో మారిషస్ దేశానికి చెందిన 55 ఏళ్ల మహిళకు శస్త్ర చికి త్స నిర్వహించి విజయవంతంగా కణితి తొలగించారు. ఆమెకు ఉన్నట్టుండి షుగర్ లెవ ల్స్ తగ్గిపోయేది. అప్పటికప్పుడు ఏమైనా తింటే సరే.. లేకపోతే కళ్లు తిరిగి పడిపోయేవారు. ఏంటా అని అక్కడి వైద్యులకు చూపి స్తే, ఆమెకు పాంక్రియాస్ (క్లోమం)లో అరుదైన కణితి (ఇన్సులినోమా) ఉందని నిర్థారిం చారు.

దీంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌కి పంపారు. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్ ఇందుకు సం బంధించిన వివరాలు తెలిపారు. సాధారణంగా పాంక్రియాస్లో కణితులను తొలగించ డం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకం టే, పాంక్రియాస్‌కు కుట్లు వేయడం కష్టమవుతుంది.

ఆమెకు ఇన్సులినోమా అనే రకం కణితి ఉన్నట్లు గుర్తించాం. మా బృందంతో పాటు అనస్థీషీయా బృందం డాక్టర్ వీరభధ్ర రావుతో కలిసి అత్యంత క్లిష్టమైన శస్త్రచి కిత్సను కేవలం లాప్రోస్కొపిక్ పద్ధతిలో చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేసి ఆమె పాంక్రియాస్లో ఉన్న కణితిని తొలగించాం.అది బాగా చిన్న కణితి కావడంతో.. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇతర టెక్నాలజీలు వాడి దాన్ని తీసేశాం. శస్త్రచికిత్స అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో.. ఆరు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం అని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.