03-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి2 (విజయక్రాంతి) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పాత రాతియుగం పనిముట్ల ఖార్ఖాన ఉన్న ట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.
కొత్త తెలం గాణ చరిత్ర బృందం పరిశోధకులు కొండవీటి గోపీవరప్రసాదరావు, మహమ్మద్ నసీ రుద్దీన్, అహోబిలం కరుణాకర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ గ్రామంలో 18.5498 ఉత్తర అక్షాం శం, 80.2680 తూర్పురేఖాంశాల మీద 12 పాతరాతియుగం రాతిపనిముట్లను గుర్తించారు. ఇవి ఆరు అంగుళాల నుంచి మూడు అంగుళాల పొడవు కలిగివున్నాయి. ఈ రాతిపనిముట్లలో క్లీవర్లు, క్లీవర్ చేతిగొడ్డలి, స్క్రాపర్లు, చాపర్లు, ఫ్లేక్స్, చేతిగొడ్డండ్లున్నాయి.
40వేల సంవత్సరాలకు పూర్వం
పనిముట్ల తయారీశైలిని పరిశీలించినపుడు ఇవి లక్ష నుంచి 40వేల సంవత్సరాల కు పూర్వానివి అని తెలిసింది. వీటిలో ద్వి కుంభాకార చేతిగొడ్డలి, ఏకముఖ స్క్రాపర్లు, ద్విముఖ క్లీవర్లున్నాయి. భూపతిపూర్ గ్రా మానికి పడమర దిక్కున, ఏజెన్సీ అటవీ ప్రాంతంలో, దేవాదుల పైప్ లైన్ దగ్గరలో గోదావరిపాయ పారే వాగులో ఈ పాతరాతియుగం రాతిపనిముట్లన్నీ లభించాయి.
ఇక్కడ ఒక పెద్ద రాతిపనిముట్ల ఖార్ఖానే ఉంది. పాతరాతియుగం పనిముట్లే కాదు, వందలాది మధ్యరాతియుగం సూక్ష్మరాతిపనిముట్లు (మైక్రోలిథ్స్) కూడా దొరుకుతు న్నాయి. ఇటువంటి పురావస్తు సంపదగల ప్రదేశాలను సంరక్షిస్తే, అవి మానవ పురాసంస్కృతిని మనకు అందిస్తాయి.
క్షేత్ర పరిశోధకులు:
1. కొండవీటి గోపీవరప్రసాదరావు-9247171248- కొత్త తెలంగాణ చరిత్ర బృందం
2. అహోబిలం కరుణాకర్- 96400 744 20- కొత్త తెలంగాణచరిత్రబృందం
3. మహమ్మద్ నసీరుద్దీన్ -99489 18091- కొత్త తెలంగాణచరిత్రబృందం