30-06-2025 02:18:48 AM
కుత్బుల్లాపూర్, జూన్ 29(విజయ క్రాంతి): మైస మ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా జీవిం చాలని కుత్బుల్లాపూర్ ని యోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపా లిటీ దుండిగల్ లో కుమ్మరి సంఘం వారు ఏర్పాటు చేసిన శ్రీ మిద్దె మైసమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, అమరం గోపాల్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ న ల్తూరి కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జనరల్ సెక్రటరీ కోల్తుర్ మల్లేష్ ముదిరాజ్, నాయకులు హనుమంత్ రెడ్డి, ముత్యం రెడ్డి, పిట్ల కృష్ణ, మధుసూదన్, ఆకుల మధు, వీరేష్, రాజు, రమేష్, సత్యనారాయణ, ఆంజనేయులు, శ్రీశైలం, రాజు, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.