17 April, 2026 | 3:24 AM

గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

17-04-2026 12:45 AM

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చండూరు , ఏప్రిల్ 16 : వేసవి కాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్లు వేయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం  అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగాసర్పంచులకు అధికారులకు  సమావేశం  నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమం, సంక్షేమ పథకాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని తెలిపారు. సర్పంచ్లు గ్రామ సమస్యలు పరిష్కరించి నిత్యం ప్రజాసేవలో ఉంటే గొప్ప స్థాయికి ఎదుగుతారని అన్నారు. .

ఈ సమావేశంలో చండూరు ఆర్ డి ఓ శ్రీ దేవి, స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో యాదగిరి  , తహసీల్దార్ రమాకాంత్ శర్మ, ఎంఈఓ  ఊట్కూరి సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల  అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.