12 April, 2026 | 1:42 AM

డ్రగ్స్ నియంత్రణకు చర్యలు

12-04-2026 12:02 AM

హెల్త్ వీక్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): డ్రగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందు కు కట్టుదిట్టమైన చర్యలు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో 6వ రోజు శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డా. కె. లలితా దేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలవాటు కలిగించే ఔషధాల దుర్విని యోగం నివారణ, నాణ్యమైన ఔషధాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ప్రతినిధులు పోస్టర్లను ఆవిష్కరించి డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన పెంచారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఫార్మసీ, నర్సింగ్, పాఠశాల విద్యార్థుల కు బహుమతులు అందజేశారు. యువతలో డ్రగ్ దుర్వినియోగం నివారణకు ఈ కార్యక్రమాలు దోహద టపడుతున్నాయని పేర్కొ న్నారు. డీఎస్పీ రమేష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డా. చంద్రకృష్ణ పాల్గొన్నారు.