28-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 27 (విజయక్రాంతి): జిల్లా లో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండి వ్యాధుల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా.ఆయేషా నసిరిమాఖాన్ అన్నారు.
శుక్రవారం నిర్మల్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణపై తీసుకుంటున్న కార్యక్రమం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.