13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు

13-01-2026 11:47 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి జిల్లా సాయి దివ్యంగుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

దివ్యాంగుల హక్కుల చట్టం 2016, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమాలు 2018 ప్రకారం జిల్లాలో అమలు అవుతున్న పథకాలు, దివ్యాంగులకు సంబంధించిన విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల చిత్రాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.