30-06-2025 12:50:36 AM
కార్పొరేటర్ల జట్టుపై మీడియా జట్టు ఘన విజయం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ భాగంగా ఆదివారం నాగోల్ బండ్లగూడలోని జీహెఎంసీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో కార్పొరేటర్ల జట్టుపై మీడియా జట్టు ఘన విజయం సాధించింది.
అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి కార్పొరేటర్ల జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మీడియా జట్టు, బ్యాట్స్మెన్ల దూకుడైన ఆటతీరుతో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగుల భారీ లక్ష్యాన్ని కార్పొరేటర్ల జట్టు ముందు ఉంచింది.
నిర్ణీత 14 ఓవర్లలో మీడియా బ్యాట్స్మెన్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కార్పొరేటర్ల టీమ్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. మీడియా జట్టు విజయంలో బౌలర్లు, ఫీల్డర్లు కీలక పాత్ర పోషించారు.