26-07-2025 12:23:12 AM
టేకులపల్లి, జులై 25,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశంతో టే కులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం 100 మునగ మొక్కలు, 100 ఇతర రకాలు ఔషధ మొక్కలు వైద్య సిబ్బంది నాటారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జయలక్ష్మి, ఎంపీడీవో మల్లీశ్వరి, వై ద్యాధికారులు డాక్టర్ కందుల దినేష్, డాక్టర్ కంచర్ల వెంకటేష్, డాక్టర్ మధు వరుణ్ లు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి మాట్లాడుతూ.. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ప్రతి ఆరోగ్య ఉప కేం ద్రంలో కూడా మునగ మొక్కలు, ఇతర ఔష ధ గుణాలు కలిగిన మొక్కలు నాటాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హె ల్త్ ఆఫీసర్ లు వజ్జా పార్వతి, పాయం శ్రీనివాస్, స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్వేత, ప బ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్లు గుజ్జా విజయ, కౌసల్య, సింగ్, నాగుబండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.