23-04-2025 12:00:00 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులతో.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీఏసీ సభ్యుల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.