calender_icon.png 5 June, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలమ్మితే సహించలేదు

03-06-2025 10:48:13 AM

ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి బిళ్ళులు కంపల్సరీ-ఎ ఓ లావణ్య

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలంలోని సీడ్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్స్ తో చర్ల రైతు వేదిక నందు సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సమావేశంలో ఏడీఏ, బి.సుధాకర్, ఏవోఎస్ లావణ్య, ఏఎంసీ  చైర్మన్ ఇర్ప శ్రీనివాస్  పాల్గొనే ప్రసంగించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎమ్మార్పీ  ధర కే సరఫరా చేయాలన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్ పై కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు కి బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని,ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు జరపన్నారు. లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి డీలర్ స్టాక్, ధరల వివరాల బోర్డుని ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  డీలర్ షాపు యాజమాన్యాలు పాల్గొన్నారు.