14-06-2025 08:00:48 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి(Indian Red Cross Society) మంచిర్యాల రక్త నిధి కేంద్రంలో మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్(DCP Eggadi Bhaskar) హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. రక్త నిధి కేంద్రంలో రక్త నిలువలు తగ్గినందున మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ శిబిరంలో 55 మంది రక్తదానం చేశారన్నారు. రక్త దాతలకు ప్రశంషా పత్రాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి ఐ (C I) సత్యనారాయణ, ఏఎస్ఐ ( ASI ) నందయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటి సభ్యులు కాసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, సంతోష్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, చుంచు శంకర్ వర్మ, సత్యనారాయణ రావు, రక్త నిధి వైద్యులు ప్రియాంక సక్సేనా, సురేశ్ బాబు, స్పందన, సిబ్బంది పాల్గొన్నారు.