calender_icon.png 19 May, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్...

18-05-2025 11:42:06 PM

గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహణ...

హాజరైన రామగుండం ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు,

సింగరేణి సంస్థ సీ అండ్ ఎండి, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో గుమ్మం వద్దకే ఉద్యోగాలు...

గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు  ఉపాధి అవకాశములు కల్పించుటకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో “మెగా జాబ్ మేళా”  కార్యక్రమం గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రు స్టేడియంలో ఆదివారం భారి ఎత్తున నిర్వహించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో గుమ్మం వద్దకే కార్పొరేట్ ఉద్యోగాలు రావడం పట్ల రెండు జిల్లాల యువతి యువకులు, వారి కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్య అతిథులుగా   రామగుండం ఎమ్మెల్యే మక్కాన్  సింగ్ రాజ్ ఠాకూర్,  హర్కర వేణుగోపాల్ రావు  ప్రభుత్వ సలహా దారు, సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  ఎన్ బలరాం నాయక్ తో పాటు సింగరేణి సంస్థ ఆయా ఏరియాలకు చెందిన అధికారులు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి  ఎమ్మెల్యే మక్కాన్  సింగ్  మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా తెలంగాణా రాష్ట్ర  డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం  సింగరేణి సంస్థ సి&ఎం.డి  ఎన్.బలరాం  సూచనల మేరకు రామగుండం ఏరియా 1,2,3 ఆద్వర్యంలో  “మెగా జాబ్ మేళా” కార్యక్రమాన్ని ఈ రోజు ఎంతో ఘనంగా నిర్వహించటం జరిగిందన్నారు.  హైదరాబాదుకు  చెందిన సుమారు  100 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా సుమారు 8000 వేల పై చిలుకు నిరుద్యోగులు పాల్గోనగా ఇందులో 3000  మందిని ఎంపిక చేసి ఉద్యోగ ఉత్తర్వులను అందజేయడం జరిగిందని,  నిరుద్యోగ యువతకు ఇదోక  చక్కటి అవకాశం అని దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాల కోసం తిరిగే అవసరం లేకుండా ఉన్న ఊరిలో చదువుకు తగిన అవకాశాలు దొరకటం ఒక అదృష్టం అని తెలిపారు.

ఈ జాబ్ మేళాకు యువత ఎంతో ఉత్సాహంగా ఉదయం 6 గంటల నుండే ఇంటర్వులకు హాజరైనారు అభ్యర్థులకు  ఇబ్బందులు తలెత్తకుండా కూలర్లు, మాజ్జిగా, చల్లటి నీరు, స్నాక్స్, టి తోపాటు మధ్యాహ్న భోజనం  ఏర్పాట్లు  చేసినందుకు సింగరేణి యాజామన్యాన్ని ప్రత్యేకంగా  అభినందించారు. తదనతరం ఇంటర్వు ఆధారంగా సెలక్ట్ అయిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉద్యోగ ఉత్తర్వులను అందజేయడం జరిగింది. ఉద్యోగ ఉత్తర్వులను అందుకున్న వారి కుటుంబాలు కుడా ఎంతో సంతోశానికి గురయ్యారు, ఈ అవకాశం కల్పించిన సింగరేణి సంస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. 

నిరుద్యోగులకు ఉపాధి కోసం ఈ జాబ్ మేళా: సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం

నిరుద్యోగులకు ఉపాధి కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి సంస్థ ద్వారా మొదటిసారిగా నిరుద్యోగులకు ఉపాది కల్పన కోసం తిలక్ నగర్ నందు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా వివిధ కోర్సులను నిర్వహించి 100 మందికి పైగా  ఉద్యోగ ఉపాది అవకాశాలు కుడా  ఇదివరకే కల్పించటం జరిగిందని తేలిపారు. ఆలాగే  వోల్వో ఆపరేటర్ శిక్షణ ఇచ్చి మరో  150 మంది అభ్యర్థులకు ఉపాది కల్పించడం జరిగినది. దీనివలన సంస్థలో పని చేసే ఉద్యోగులకే కాక పరిసర ప్రాంత మరియు ప్రాభావిత గ్రామాల నిరుద్యోగులకు ఇది వారికి జీవోనోపాది అవుతుందని ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులను అభినందిచారు. ఈ కార్యక్రమంలో జిఎంలు లలిత కుమార్, ఏసిపి రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.