దేశాన్ని కుబేరులకు అప్పగిస్తోంది

29-04-2024 01:21:28 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని

ప్రొఫెసర్ హరగోపాల్


హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : రాజ్యాంగ స్వయం ప్రతి పత్తితో పనిచేయాల్సిన కేంద్ర సంస్థలను నరేంద్రమోదీ, అమిత్‌షాలు నిర్వీర్యం చేసి, ఖూని చేస్తున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. సనాత న ధర్మం పేరుతో హిందూరాష్ట్రాన్ని స్థాపిం చి, కులస్థిరీకరణ చేసి, దేశ భవిష్యత్‌ను అదాని, అంబానీ లాంటి కుబేరుల చేతుల్లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంద న్నారు. ప్రజలను బిచ్చగాళ్లను చేయడానికి పారామిలిటరీ, బీఎస్‌ఎఫ్ బలగాలను మోహరించి ఆదివాసీలను, వారికి అండగా నిలబడిన మావోయిస్టు పార్టీలను నిర్మూలి ంచాలనే లక్ష్యంతో తాజా గా 80మందిని హత్య చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతో ఉన్న సంఘ్‌పరివార్ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగభూషణ్, ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ ఖాసీం, పాశం యాదగిరి పాల్గొన్నారు.