మంత్రి పొన్నంకు కరీంనగర్ నీటి సమస్యపై వినతి పత్రం
14-04-2026 02:56 PM
ముకరంపుర,(విజయక్రాంతి): సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కరీంనగర్ నీటి సమస్యపై వినతి పత్రం సమర్పించారు. అందులో కరీంనగర్ ఎల్ ఎండికి మూడు టీఎంసీల నీటిని మిడ్ మానేరు నుండి కరీంనగర్ ఎల్ఎండికి విడుదల చేయాలని రాబోయే ఎండ కాలం దృష్ట్యా కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా యధావిధిగా జరిగేటట్టు మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, పిసిసి రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర దేవేందర్ పటేల్ పెంట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




