12-04-2025 12:35:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఫ్యూచర్సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్సిటీ లోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెం ట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరణకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అం చనాలతో డీపీఆర్ తయారు చేసి, కేంద్రానికి పంపించాలని పేర్కొన్నారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏ (ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ)ని ఈ రూట్ మెట్రో విస్తర ణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పా రు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబా ద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం--కోకాపేట-నియోపొలీస్(11.6కి.మీ.),ఎంజీబీఎస్--చాంద్రాయణగుట్ట(7.5కి.మీ.), మియాపూర్-పటాన్చెరు(13.4కి.మీ.), ఎల్బీనగర్--హయత్నగర్(7.1కి.మీ.) మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపించింది.
కేంద్రంతో పాటు రాష్ర్ట ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేం ద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు.
ప్రతిపాదిత మెట్రో మార్గానికి కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉం దని.. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్టు అధికారులు వివరించారు. సీఎం సలహాదారులు వేం నరేంద ర్రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.