17 April, 2026 | 12:11 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

02-05-2025 12:55 AM

 కడ్తాల్, మే 1 : కడ్తాల్ మండల కేంద్రం లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్లమెంట్ లోని కాంగ్రెస్ పక్ష ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పాటానికి ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి  పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో అన్ని అన్నీ రాష్ట్రాలలో జనగణన లో కులగణన చేసి ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నదో తేల్చి ఆయా వర్గాలకు సామాన అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా  విద్య, ఉద్యోగ, ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆర్థికంగా దేశ రాష్ట్ర బడ్జెట్లలో తగిన వాటా ఇచ్చి దేశంలో అందర్నీ సరి సమానంగా చూడాలని ఎవరెంతో వారికంత అనే నినాదం తో ప్రజల కలలు సాకరం చేసి నెరవేరుస్తానని ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే  మనమంతా సమానమే అనే నినాదం తో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర చేపట్టి ఆయా రాష్ట్రంలో దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంట్లో మెజార్టీ రాగానే ఈ దేశంలో కులగనణ లు వేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .

ప్రాంతీయ వాదనలతో పాటు దేశ సామజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి గొప్ప ప్రయత్నం అని దేశ భవిష్యత్ అభివృద్ధి బాట పడుతుందని అయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తెలంగాణలో గెలిస్తే కులగణన చేసి అందులో ఏ ఏ సామాజిక వర్గం ఏ కులం ఎంతుందో తెలిసి అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా బీసీలకు తగు న్యాయం జరిగేలా కాంగ్రెస్ కృషి చెసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి నేనావత్ బీక్యా నాయక్, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభావత్ బీచ్యా  నాయక్, అమనగల్ అధ్యక్షులు జగన్, మార్కెట్ డైరెక్టర్ అజీమ్, రామకృష్ణ, జవహర్లాల్, లక్ష్మణ్ నాయక్, హీర సింగ్ నాయక్, యాదయ్య, బాలరాజ్, రామచందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.