14-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం, సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్తోపాటు కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది.