14-01-2026 01:50:28 AM
వాతావరణ కేంద్రం అంచనా
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న ఒకట్రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం మంగళవారం అంచనా వేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.