10 March, 2026 | 6:52 PM

మున్సిపల్ సిబ్బందికి బిర్యాని ప్యాకెట్ల పంపిణీ

10-03-2026 05:37 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసోహం వెంకటేశ్వర్లు  తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత పాల్గొని వారి చేతుల మీదుగా కార్మికులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు.