27 June, 2026 | 2:47 AM

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి

27-06-2026 01:56 AM

ధర్మపురి, జూన్26 (విజయక్రాంతి): మొహర్రం సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురిలో వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తాలో పీరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా హిందూ, ముస్లీంలు సోదరభావంతో కలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యా దేశంలో భవిష్యత్తు తరాల కోరకు ఇదే సంస్కృతిని కొనసాగించాలని మంత్రి కోరారు.