28-06-2025 12:00:00 AM
జగిత్యాల, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం కోరుట్ల నియోజకవర్గానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల సె గ్మెంట్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆహ్వానం మేరకు మంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ కోరుట్ల అధ్యక్షులు తిరుమల గంగాధర్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.
కోరుట్ల జి.ఎస్.గార్డెన్లో శనివారం జరిగే సన్మాన సభలో, పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి పాల్గొంటారన్నారు. కోరుట్ల ప్రాంత ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనిగంగాధర్కోరారు.