30-09-2025 05:17:42 PM
పనాజి: గోవాలో మహజే ఘర్ గృహనిర్మాణ పథకాన్ని, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న ప్రారంభించనున్నారని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ... అక్టోబర్ 4 సాయంత్రం అమిత్ షా గోవాకు వస్తున్నారని, ఆ తర్వాత మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను తెలియజేస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజే ఘర్ గృహనిర్మాణ పథకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరిస్తారని, ఈ పథకం వివిధ వర్గాలలోని లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పించనుందని ఆయన స్పష్టం చేశారు. గోవా అభివృద్ధి ప్రణాళికను బలోపేతం చేసే ప్రశాసన్ స్తంభ్, యూనిటీ మాల్, హర్వాలెం జలపాతానికి అప్గ్రేడ్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవాలను కూడా షా పర్యవేక్షిస్తారని గోవా సీఎం ధృవీకరించారు.