9 April, 2026 | 10:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

అక్టోబర్ 4న గోవాలో గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్న అమిత్ షా

30-09-2025 05:17 PM

పనాజి: గోవాలో మహజే ఘర్ గృహనిర్మాణ పథకాన్ని, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అక్టోబర్ 4న ప్రారంభించనున్నారని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ... అక్టోబర్ 4 సాయంత్రం అమిత్ షా గోవాకు వస్తున్నారని, ఆ తర్వాత మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను తెలియజేస్తారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజే ఘర్ గృహనిర్మాణ పథకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరిస్తారని, ఈ పథకం వివిధ వర్గాలలోని లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పించనుందని ఆయన స్పష్టం చేశారు. గోవా అభివృద్ధి ప్రణాళికను బలోపేతం చేసే ప్రశాసన్ స్తంభ్, యూనిటీ మాల్, హర్వాలెం జలపాతానికి అప్‌గ్రేడ్‌లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవాలను కూడా షా పర్యవేక్షిస్తారని  గోవా సీఎం ధృవీకరించారు.