16 March, 2026 | 9:57 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

నేనున్నా.. అధైర్యపడకండి

25-05-2025 10:58 PM

మూగజీవాలు కోల్పోయిన రైతులకు అండగా మంత్రి పొంగులేటి..

ఖమ్మం (విజయక్రాంతి): నేనున్నానని... అధైర్య పడకండని.. 75 మూగజీవాలు కోల్పోయిన రైతులతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండా గ్రామంలో కొందరి రైతులకు చెందిన సుమారు 75 మేకలు మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లిన మేకలు మృత్యువాత పడడంతో రైతుల ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో స్థానిక గిరిజన రైతులు కన్నీరు మున్నీరయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలీ తదితరులు రైతులను ఓదార్చి మూగజీవాల ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామ హాయం రఘురాం రెడ్డి తక్షణమే రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని ఫోన్ ద్వారా రైతులకు హామీ ఇచ్చారు.