calender_icon.png 23 June, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం

23-06-2025 12:05:46 AM

కొత్తపల్లి, జూన్ 23 (విజయ క్రాంతి): చింతకుంట చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన స ర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఈజేఎస్ కింద 40 లక్షల ఈత, 5 లక్షళ తాటి మొక్క లు నాటుతున్నామన్నారు.

మొక్కలు సిద్ధం గా ఉన్నాయని , గౌడ సంఘ నేతలు ప్రభు త్వ స్థలాలు గుర్తించి అధికారుల దృ ష్టికి తీసుకురావాలని, ఆ స్థలాల్లో మొక్కలు నా టాలన్నారు. కల్లు కల్తీలేకుండా ఉంటే ఔష దం లాంటిదని, కల్లు కాంపౌండ్లకు నిధులిస్తామన్నారు. చింతకుంటలో కల్లు కాంపౌం డ్ నిర్మించుకుంటే 5లక్షలు కేటాయిస్తామని తెలిపారు.సర్వాయి పాపన్న స్ఫూర్తిని అంద రూ అందిపు చ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.