30 April, 2026 | 12:17 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

బ్యాంకు భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ

07-11-2024 01:12 PM

మంథని (విజయక్రాంతి): మంథని సత్య సాయినగర్ లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంథని బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. రూ.35 లక్షలతో నిర్మించనున్న నూతన భవనం త్వరితగతిన పూర్తి కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, ఛైర్మన్ కెడిసిసి బ్యాంక్ కరీంనగర్, సత్యనారాయణ రావు, ముఖ్య కార్య నిర్వహణాధికారి, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్, మంథని బ్రాంచ్ మేనేజర్ ఉదయశ్రీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.