calender_icon.png 25 September, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గా మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

25-09-2025 06:53:43 PM

స్వగ్రామంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): దుర్గా మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలో శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రాహా హోమం, మహా చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు, అనంతరం మంత్రి వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.