25 July, 2026 | 11:55 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల

27-06-2024 10:55 AM

అశ్వాపురం: ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్‌ మోటర్ల ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. పంప్ హౌస్ వద్ద గోదావరికి మంత్రి పూజలు చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో మంత్రి తుమ్మల పర్యటించారు. బి.జి. కొత్తూరు పంప్ హౌస్ ను పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. ఈ ఏడాది వైరా ప్రాజెక్టు వరకు నీళ్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మంత్రి తుమ్మల ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.