14 May, 2026 | 1:27 AM

ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

14-05-2026 12:00 AM

కొండపాక, మే 13: కుక్కునూరు పల్లి మండల కేంద్రంలో బొడ్రాయి ప్రాణ ప్రతి ష్ట మహోత్సవానికి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో బుధవారం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి వివే క్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముందుగా ఇన్చార్జి మంత్రి వివేక వెంకటస్వామి కి స్వా గతం పలికి, శాలువాతో సన్మానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక వెంకట స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండపాక ఉమ్మడి మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్ పోల్కంపల్లి నరేందర్ నాయకులు పాల్గొన్నారు.