21 May, 2026 | 11:11 AM

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో

11-08-2025 09:00 AM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి(Nizamsagar project) స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు  ప్రాజెక్టు ఏ ఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1391.92 అడుగులతో 4.936 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుండగా  ప్రాజెక్టులోకి  4,690 క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు.