07-02-2026 04:26:44 PM
తరలిస్తామంటే పోరాటాలు చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరిక
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ కయీమ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... తుంగతుర్తి ప్రాంతంలో సరైన వసతులు లేవనే సాకుతో, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను వేరే ప్రాంతానికి తరలిస్తామంటే ఊరుకునేలేదని హెచ్చరించారు.
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి పాఠశాలకు నూతన ప్రభుత్వ భవనాన్ని మంజూరు చేయాలని సరైన వసతుల కోసం ప్రత్యేక నిధులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మల్లెపాక సాయిబాబా, తడకమళ్ళ రవికుమార్, గొపగాని రమేష్, నారాయణదాసు నాగరాజు, ఉప్పుల నాగమల్లు బొజ్జ సాయికిరణ్, సాయి కృష్ణ , మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.