calender_icon.png 7 June, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

07-06-2025 02:33:02 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ శీతల పరమేశ్వరి (బొడ్రాయి) ఉత్సవాల్లో వలిగొండ స్వగ్రామమైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy)-కిరణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి- కిరణ్  దంపతులు పాల్గొన్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ పరమేశ్వరి (బొడ్రాయి)కి జలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పండుగలు ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకువస్తాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీశ్రీశ్రీ శీతల పరమేశ్వరి అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని త్వరలో వారికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడం జరిగిందని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.