23-10-2025 06:42:31 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ రాఘవేంద్రనగర్ లో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ శాంతితో కలిసి ఏమ్మెల్యే లక్ష్మారెడ్డి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ మక్తాల శేఖర్ గౌడ్ సంఘం యాదగిరి సురేందర్ గౌడ్ వెంకట్ రెడ్డి విలాస్ రెడ్డి ప్రవీణ్ జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.