17-06-2025 06:47:53 PM
కోదాడ: పట్టణ పరిధిలోని అశోక్ నగర్ లోని శనగల రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ రాష్ట్ర నాయకులు భాష బోయిన భాస్కర్, నియోజకవర్గ కన్వీనర్ ముసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు మిఠాయిలు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు అల్లి వీరబాబు, మూసి మట్టయ్య, సాగర్ల నాగేశ్వరరావు, చిలక రమేష్, పిల్లుట్ల లక్ష్మయ్య, వేముల శ్రీనివాస్, నరసింహారావు, సత్యనారాయణ, కే రామారావు, మల్లయ్య, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.