24-04-2025 12:43:23 AM
దౌల్తాబాద్, ఏప్రిల్ 23: సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు పబ్బ మాధవి, దౌల్తాబాద్ ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు పబ్బ అశోక్ గుప్తాల కుమారుడు శరత్ కుమార్, లాస్యల వివాహం దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్ లో జరగగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ జడ్పిటిసి రణం జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి తోపాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు...